1 July, 2026 | 11:27 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పండగల విశిష్టతను భావితరాలకు తెలపాలి: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

29-06-2025 07:28 PM

అనంతగిరి: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయినా ఆదిదేవతల ఉప్పలమ్మ పండగల విశిష్టతను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి(MLA Padmavathi Reddy) అన్నారు. ఆదివారం అనంతగిరి మండల కేంద్రంలోని మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్రావు క్లాసర్ మిల్లులో జరిగిన ఉప్పలమ్మ పండగ సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉప్పలమ్మ ఎల్లమ్మ మైసమ్మ పండగలతో పాటు గ్రామదేవతలు కొలిచే పండగలు పూర్వం నుంచి కొలిచే ఆచారాలు ప్రతివేట కొనసాగుతున్నాయన్నారు. వీరు ఆచరించి కొలిచే పవిత్రమైన ఉప్పలమ్మ దేవత కుటుంబ సభ్యులందరినీ చల్లగా చూడాలని దేవతను ప్రార్థించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు వేనేపల్లి సతీష్ వివిధ గ్రామాల సీనియర్ నాయకులు అభిమానులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.