01-06-2025 12:31:46 AM
- నిర్మాత, దర్శకత్వం కాంగ్రెస్
- 6 గ్యారెంటీలపై దృష్టి మరల్చేందుకు ఎత్తుగడ
- అవినీతి బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు ప్రసక్తే లేదు
- కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, మే 31 (విజయక్రాంతి): కల్వకుంట్ల ఆర్ట్స్ పతాకంపై కాంగ్రెస్ పార్టీ నిర్మాణం, దర్శకత్వంలో కల్వకుంట్ల కవిత ప్రధాన పాత్రధారిగా ‘చార్ పత్తా’ సినిమా రాష్ట్రంలో నడుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ వ్యాఖ్యానించారు. ఇందులో కేసీఆర్ను జోకర్గా మార్చారన్నారు.
శనివారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం లోని మధురానగర్, బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బండి సంజయ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంద ని, 6 గ్యారంటీలపై చర్చ జరగకుండా చిట్చాట్ల పేరుతో ప్రజల దృష్టి మళ్లించే కుట్ర జరుగుతోందన్నారు. అసలు బీఆర్ఎస్ అంటే నే కుటుంబ, అవినీతి పార్టీ అన్నారు.
కవితను అరెస్ట్ చేయకుండా ఉండటానికి బీజేపీతో కలవడానికి బీఆర్ఎస్ ప్రయత్నించిందని, కానీ అట్లాంటి అవినీతి, కుటుంబ పార్టీని తాము దగ్గరకు కూడా రానియ్యలేదన్నారు. వాళ్లు ఎన్ని డ్రామాలాడినా బీఆర్ఎస్ను దగ్గర తీసే ప్రసక్తే లేదని, ఆ పార్టీతో పొత్తు ఊసే ఉండదన్నారు. రైతుల విషయంలో కేసీఆర్ మాదిరి గానే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. అన్నీ గాలికి వదిలేసి 18 నెలలుగా టైం పాస్ పొలిటిక్స్ చేస్తున్నారన్నారు. 6 గ్యారంటీలపై చర్చ జరుగుతుంటే ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ సర్కార్ అవినీతి విషయంలో కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామన్నారు. కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, ఫాంహౌజ్, ఫార్ములా ఈ రేసు కేసుల విషయంలో కేసీఆర్, కేటీఆర్లను అరెస్ట్ చేస్తామని చెప్పి మాట తప్పారని, కాంగ్రెస్పై ప్రజలకు నమ్మకం పూర్తిగా పోయిందన్నారు. ఢిల్లీకి పోయి మూటలు అప్పగించడం తప్ప కాంగ్రెసోళ్లతో ఏదీ చేతగాదని తేలిపోయిందని దుయ్యబట్టారు.
కాగా ఆపరేషన్ సిందూర్పై సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలని, భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఫైర్ అయ్యారు. కాగా ఈటల రాజేందర్, హరీశ్రావు భేటీ అయ్యారనే విషయం తనకు తెలి యదని, ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని చెప్పారు. ఆయనవెంట చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్ మాజీ మేయర్ సునీల్రావు ఉన్నారు.
గోవులను కూడా రక్షించకుంటే ఎట్లా?
వేములవాడ రాజన్న ఆలయ పరిధిలో 18 గోవులు చనిపోవడంపై అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, గోవుల ను కూడా రక్షించకపోతే ఎట్లా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. సరైన సౌకర్యాలు కల్పించి వాటిని కాపాడాల్సిన బాధ్యత వాళ్లపై లేదా అని నిలదీశారు. గోవుల సం ఖ్యకు తగినట్లుగా సౌకర్యాలు కల్పించేలా ఆలయ ఈవోతో మాట్లాడతానని చెప్పారు. రాజన్న ఆలయంలో భక్తుల సంఖ్యతోపా టు ఆదాయం కూడా పెరుగుతున్నందున భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలే తప్ప భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.