28 June, 2026 | 2:49 PM

Breaking News

ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •  

మంథనిలో అక్రమ కట్టడాలకు చెక్

02-09-2024 01:47 AM

నిర్మాణాలను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు

అందోళన చెందుతున్న అక్రమార్కులు

మంథని, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): మంథని పట్టణంలో అక్రమ కట్టడాలకు అధికారులు చెక్ పెడుతున్నారు.  గతంలో రాజయకీయ నాయకుల అండదండల ంతో అక్రమార్కులు నిర్మించిన కట్టడాలు నేలమట్టం కానున్నాయి. దీ ంతో పట్టణ ప్రజలు ఆనందం వ్య క్తం చేస్తున్నారు. మంథని పట్టణం లో ప్రధాన రహదారికి ఇరువైపుల అక్రమంగా దుకాణాలను నిర్మించుకొని ప్రయాణికులకు తీవ్ర ఇబ్బ ందులు పెడుతున్నారని మున్సిపల్ అధికారులకు  ఫిర్యాదులు అందా యి.

శ్రీపాద చౌక్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్రధాన రహదారి పైకి దుకాణాలు వెలిశాయి.  ము న్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి ఆదివారం సిబ్బందితో వెళ్లి అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. అక్రమ కట్టడాలను తొలగించి ప్రయణికులకు ఇబ్బందులు లేకుండ చేస్తామని కమిషనర్ తెలిపారు. మున్సిపల్ పరిధిలో అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేస్తే విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటుమా ని కమిషనర్ హెచ్చరించారు. కొం దరికి చెందిన అక్రమ కట్టడాలనే కూలుస్తారా లేక మరికొందరి అక్ర మ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా అని ప్రజలు చర్చించు కుంటున్నారు.