03-05-2025 07:46:52 PM
చేగుంట (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలని చేగుంట తాసిల్దార్ శ్రీకాంత్(Tahsildar Srikanth) ఆదేశించారు. శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చేగుంట మండలం వడియారం గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ధాన్యం సేకరణ, ట్యాబ్ ఎంట్రీలు, కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాలను నిర్వాహకుల నుండి అడిగి తెలుసుకున్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం సేకరించిన వెంటనే వాటి వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయాలని,నాణ్యతా ప్రమాణాలు మేరకు ధాన్యం తీసుకువచ్చిన రైతుల నుంచి నిబంధనల ప్రకారం తూకం వేయాలని, ధాన్యం డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడేలా చూడాలని పేర్కొన్నారు.