రాజ్ భవన్కు బయలుదేరిన ముఖ్యమంత్రి
01-07-2024 12:52 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు బయల్దేరారు. తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భేటీ కానున్నారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చించనున్నారు. జూలై 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.






