calender_icon.png 8 June, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటిన న్యాయమూర్తులు

07-06-2025 12:36:16 AM

అర్మూర్, జూన్ 6 (విజయక్రాంతి) : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ లోని కోర్టు ప్రాంగణనంలో ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, అదనపు జూనియర్ సివిల్  జడ్జి సరళ, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గడుగు గంగాధర్ లు మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు గటడి ఆనంద్, సంయుక్త కార్యదర్శి మద్దుల గంగాధర్, గ్రంథాలయ కార్యదర్శి శ్రావణ్ కుందారం, సీనియర్ న్యాయవాది లోక భూపతిరెడ్డి, పిపి ఖాందేశ్ శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు చిలుక కిష్టయ్య, న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.