13-06-2025 02:23:10 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, జూన్ 12 (విజయ క్రాంతి): అన్ని సౌకర్యాలతో ఇంటికి సమీపంలో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చే ర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. గురువారం కరీంనగర్ రూరల్ మండలం మొగ్ధం పూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల పున:ప్రా రంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ హాజరై విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వినూత్న రీతిలో ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. డెడ్ ఎడ్, ఒలంపియాడ్, కంప్యూటర్ వంటి విభిన్న రంగాల్లో, క్రీడా పోటీల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు.
పుస్తకాలు, యూనిఫామ్ ఉచితంగా ఇస్తూ పైసా ఖర్చు లేకుండా చదువుకునే వెసులుబాటు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.పద్మపాల్గొన్నారు.