05-06-2025 12:00:00 AM
న్యూయార్క్, జూన్ 4: ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని కబళించిన కరోనా వైరస్ను మరువకముందే చైనా దేశం నుంచి మరోకొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. అయితే ఈసారి సృష్టించిన వైరస్ మానవాళి ము ప్పుకు కాకుండా వ్యవసాయ ఉగ్రవాదంపై చైనా అడుగులు పడ్డాయి. తాజాగా అమెరికాలో ఉన్న ఇద్దరు చైనా శాస్త్రవేత్తలు ఆగ్రో టెర్రరిజం పరిశోధనలో భాగంగా ప్రమాదకరమైన బయోలాజికల్ ప్యాథోజన్ను స్మగ్లిం గ్ చేస్తున్నట్టు సమాచారం అందింది.
బయోలాజికల్ ప్యాథోజన్ను స్మగ్లింగ్ చేసినందుకు గానూ చైనాకు చెందిన యున్కింగ్ జియాన్ (33), జుయాంగ్ లియూ (34)లను పోలీసు లు అదుపులోకి తీసుకున్నట్టు ఎఫ్బీఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ పేర్కొన్నారు. కుట్ర, స్మగ్లిం గ్ కేసుతో పాటు తప్పుడు ప్రకటనలు, వీసా ఫ్రాడ్ కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపా రు.
వ్యవసాయ ఉగ్రవాద ఆయుధంగా బయోలాజికల్ ప్యాథోజన్ను వాడేందుకు ప్రయత్నాలు జరిగినట్టు అమెరికా ఆరోపించింది. కాగా ఈ ఫంగస్ శాస్త్రీయ నామం పు సేరియం గ్రామినేరరియం. టెక్నాలజీ పర ంగా చూస్తే దీనిని ఆగ్రో టెర్రరిజం ఆయుధంగా వినియోగిస్తున్నారని, భారీ స్థాయిలో ఆర్థిక నష్టం వాటిల్లుతుందని అమెరికా న్యాయశాఖ తెలిపింది. ఫంగల్ వైరస్ పరిశోధన కోసం మిషిగాన్ యునివర్సిటీకి శాంపి ళ్లను తరలించారు.
ఏమిటీ పుసేరియం గ్రామినేరియం?
పుసేరియం గ్రామినేరియం వల్ల పంటలకు మాత్రమే నష్టం కాదు.. ఆ ఆహారం తి న్న మనుషులకు రకరకాల వ్యాధులు సోకే అవకాశాలున్నాయి. ఈ ప్రమాదకర ఫంగస్ గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ఫంగస్ ‘హె డ్ బ్లుటై ’ అనే వ్యాధికి దారి తీయనుంది. ప్ర పంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ ఫంగస్తో భవిష్యత్లో పంటలు పండే అవకాశంతో పాటు వ్యవసాయానికి కూడా అవకాశం ఉ ండదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
భారత్పై ప్రభావం పడే అవకాశం?
భారత్లో వ్యవసాయ రంగం దేశ జీడీపీ కి దాదాపు 17 శాతం వాటాను అందిస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్లో 55 శాతం మంది వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. చైనా, పాకిస్థాన్తో సరిహద్దు పంచుకుంటున్న పం జాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో ఆగ్రో టెర్రరి జం ముప్పు మరింత ఎక్కువగా ఉండనుం ది.
డీఆర్డీవో వివరాల ప్రకారం.. 2016లో బెంగాల్లో రెండు జిల్లాల్లో విషపూరిత శీలీ ంద్రం కనుగొన్నట్టు తెలిపింది. 2015లో పాకిస్థాన్లో పత్తి ఆకు ముడత వైరస్ వ్యాప్తి చెంది పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ వైరస్ ప్రభావం భారత్లోని దక్షిణ పంజాబ్పై కూడా పడింది.
ఫలితంగా తెల్లదోమలు తీవ్రంగా వ్యాప్తి చెంది పత్తి పంట ల్లో మూడింట రెండు వంతులు దెబ్బతినడంతో 630 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని నివేదిక తెలిపింది. చైనా ఆగ్రో టెర్రరిజం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో భారత్కు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.