26-06-2025 12:51:01 AM
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా ఆంక్షలు అడ్డంకిగా మారాయని, ఆ ప్రభావం తెలంగాణ తయారీ రంగంపై పడి సంక్షోభం నెలకొన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యలకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
బుధవారం మంత్రి శ్రీధర్బాబు ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, ముడి పదార్థాలు, రసాయనాల కోసం ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు చైనాపై ఆధారపడుతుండటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమ వుతున్నాయని పేర్కొన్నారు.
సమస్యల కారణంగా ఆయా కంపెనీల పరిధిలో ఉత్పత్తి తగ్గుతున్నదని, ఉత్పత్తి తగ్గితే ఆ ప్రభావం కార్మికుల ఉపాధిపైనా పడుతుందని వివరించారు. వెంటనే తమకు ప్రత్యామ్నాయ మా ర్గాలు చూపాలని విజ్ఞప్తి చేశారు.
పారిశ్రామికరంగ బలోపేతానికి సహకరించండి..
తెలంగాణ పారిశ్రామిక రంగంలో మౌలి క సదుపాయాల అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు కోరారు. హైదరాబాద్- నాగ్పూర్, హైదరాబాద్- వరంగల్, హైదరా బాద్- బెంగళూరు, హైదరాబాద్ -విజయవాడ ఇండస్ట్రీయల్ కారిడార్ల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
పీఎం గతిశక్తి పథకం కింద జహీరాబాద్ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.400 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ -వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఆగిపోయిందని, ఈ కారిడార్లో భాగ మైన ఫార్మా సిటీ ప్రాంతాన్ని తమ ప్రభు త్వం ‘ఫ్యూచర్ సిటీ’గా అభివృద్ధి చేస్తోందని వివరించారు. అలాగే వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరారు.
100 పారిశ్రామిక పార్కుల పథకంలో ప్రాధాన్యం ఇవ్వండి
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 100 పారిశ్రామిక పార్కుల పథకంలో తెలంగాణకూ ప్రాధాన్యం ఇవ్వాలని, రాష్ట్రంలోని పార్కుల అభివృద్ధికీ సహకరించాలని కేంద్ర మంత్రిని రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు కోరారు. డిజైన్ రంగానికి ఊతమిచ్చేలా, మేక్ ఇన్ ఇం డియా ఉత్పత్తుల తయారీలో భారత్ గ్లోబల్ గుర్తింపు సాధించేలా హైదరాబాద్లో జాతీయ డిజైన్ సెంటర్ ఏర్పా టు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఈ అంశంపై కేంద్రా నికి ప్రతిపాదనలు పంపిందని గుర్తుచేశారు.
డిజైన్ సెంటర్ ఏర్పాటుతో హైద రాబాద్ థింకింగ్కు కేంద్రంగా అవతరిస్తుందని ఆకాంక్షిం చారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేస్తోందని, తాము కేంద్ర ప్రభుత్వంతో కలిసి ‘వికసిత్ భారత్-2047’ లక్ష్యం సాధన కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఆయా విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, వాటికి ప్రాధాన్యక్రమంలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు.