10-05-2025 01:39:30 AM
చిట్యాల సీఐ నాగరాజు
నార్కట్పల్లి, మే 9: బ్యాంకింగ్ సేవల విషయంలో సిబిల్ స్కోర్ చాలా కీలకమని చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు తెలిపారు. నార్కట్ పల్లి మండలంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఏబి సొల్యూషన్స్ బ్రాంచ్ ను ఎస్ బీఐ బ్యాంకు కాంప్లెక్స్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ నాగరాజు, ఎస్త్స్రలు క్రాంతి కుమార్ ఆంజనేయులు మాట్లాడారు.
ప్రస్తుత రోజుల్లో సివిల్ స్కోరు పెద్ద ఆస్తిలా మారిందన్నారు. బ్రాంచ్ హెడ్. శంకర్.డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఫైనాన్స్, బ్యాంకింగ్ సేవల విషయంలో సిబిల్ స్కోర్ చాలా కీలకమైన అంశంగా ఉన్నందున సిబిల్ స్కోర్ సంబంధిత సమస్యల కోసం ఏబీ సొల్యూషన్స్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
కార్యక్రమంలో బ్రాంచ్ బిజినెస్ మేనేజర్, అధికారులు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంక్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, విద్యాసంస్థల చైర్మన్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు శాలువా, పూల మొక్కలతో సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.