06-01-2026 08:09:01 PM
సిద్దిపేట క్రైం: ఈ నెల 8 నుంచి 23 వరకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. 8న ఉదయం 6 గంటల నుంచి 23న ఉదయం 6 గంటల వరకు ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. అత్యవసరమైతే పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు.
బంద్ ల పేరిట బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు ఉన్నాయని తెలిపారు.