11-06-2025 08:24:52 PM
హైదరాబాద్: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Union Public Service Commission) సివిల్స్(Civil Services Examination) ప్రిలిమ్స్ 2025 ఫలితాలను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(CSE) ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు UPSC అధికారిక వెబ్సైట్ upsc.gov.inలో ప్రకటించినప్పుడు ఫలితాలను తనిఖీ చేయవచ్చు. దేశవ్యాప్తంగా మే 25న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 10 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో రెండు ఆబ్జెక్టివ్-టైప్ పేపర్లు (MCQలు) ఉన్నాయి.
ఒక్కొక్కటి రెండు గంటల వ్యవధి, గరిష్టంగా 200 మార్కులను కలిగి ఉంటాయి. ప్రతి మూడు తప్పు సమాధానానికి ఒక సరియైన సమాధానం {మూడింట ఒక వంతు (0.33)} జరిమానాగా తీసివేయబడుతుంది. ప్రిలిమ్స్ పరీక్ష కేవలం స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే, ఇక్కడ పొందిన మార్కులను తుది మెరిట్ జాబితాను నిర్ణయించడానికి లెక్కించబడదు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 979 ఖాళీలను భర్తీ చేయాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు రూ.200 చొప్పున రుసుం చెల్లించి వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
మహిళలు/పీడబ్ల్యూబీడీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ జూన్ 16 నుంచి 25 వరకు అందుబాటులో ఉంటుంది. కోర్టు కేసుల నేపథ్యంలో నలుగురు అభ్యర్థుల ఫలితాలను పెండింగ్లో ఉంచినట్లు యూపీఎస్సీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఫలితాలకు సంబంధించి ఏదైనా సమాచారం/వివరణ కోసం విద్యార్థులకు యూపీఎస్సీ ఫెసిలిటేషన్ కౌంటర్ను ఢిల్లీలోని షాజహాన్ రోడ్డులో ఎగ్జామినేషన్ హాల్ భవనం వద్ద అధికారులు ఏర్పాటు చేశారు. అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటు ఉంటుంది. ఫోన్ నంబర్లు 011-23385271, 011-23098543, 011-23381125కు కాల్ చేసి సంప్రదించవచ్చు.