11-06-2025 12:31:31 AM
ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): ఈ విద్యాసంవత్సరం రాష్ట్రం లోని ప్రభుత్వా జూనియర్ కళాశాలల్లో ఒక లక్షకిపైగా విద్యార్థులను చేర్పించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల పురోగతిపై మంగళవారం ఆయ న జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆయా కాలేజీల్లో ఇప్పటి వరకు 35వేల అడ్మిషన్లు నమోదైనట్లు ఆయన తెలిపారు.