calender_icon.png 29 June, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

4500 ఏళ్ల నాటి నాగరికత వెలుగులోకి

29-06-2025 12:50:28 AM

  1. రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా భాజ్ గ్రామంలో ఆనవాళ్లు
  2. తవ్వకాల్లో బయటపడిన 800 రకాల వస్తువులు, పురాతన నది పాయ
  3. మహాభారత, మౌర్యుల కాలం నాటి ఆయుధాలు లభ్యం 
  4. పరిశోధన కోసం ఇజ్రాయెల్‌కు మానవ పుర్రె

జైపూర్, జూన్ 28: రాజస్థాన్‌లో 4500 ఏళ్ల క్రితం నాటి నాగరికత ఆనవాళ్లు బయటపడడం సంచలనం కలిగించింది. రాజస్థా న్‌లోని డీగ్ జిల్లా భాజ్ గ్రామంలో భారత పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో ఇవి వెలుగు చూశాయి. మహాభారత, మౌర్య, శుంగా రాజవంశీయుల కాలం నాటి వస్తువులు, ఆయుధాలు బయటపడడం విశేషం. ఈ ఏడాది జనవరి 10న పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టింది. అప్పటి నుంచి ఆరు నెలలుగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు 23 మీటర్ల లోతైన పురాతన నది పాయను గుర్తించారు.

హరప్పా, బ్రజ్, మథుర ప్రాంతాల్లోని ఆనాటి నాగరికతల నివాసానికి ఈ నది కీలక ఆధారంగా ఉండేదని పేర్కొన్నారు. కాగా తవ్వకాల్లో 800లకు పైగా పురాతన వస్తువులు బయటపడ్డాయి. వీటిలో అత్యంత పురాతన నాణేలు, ముద్ర లు, యజ్ఞ కుండాలు, మౌర్య, కుషాణ, గుప్త కాలం నాటి విగ్రహాలు ఉన్నాయి. కాగా తవ్వకాల్లో బయటపడిన పనిముట్లు, ఆయుధా లు 2500 బీసీల కాలం నాటివని తెలుస్తోం ది. దీనిని బట్టి ఇవి మహాభారత కాలం నాటివని తెలుస్తోంది. వీటితో పాటు ఒక మానవ పుర్రె కూడా లభ్యమైంది.

పరిశోధన కోసం మానవ పుర్రెను ఇజ్రాయెల్‌కు పంపించారు. మొత్తానికి ఈ తవ్వకాల ద్వారా ఐదు చారిత్రక దశల ఆధారాలను శాస్త్రవేత్తలు గుర్తించడం విశేషం. మహాభారత యుగంతో పాటు హరప్పా, మౌర్యుల, కుషాణ, గుప్త యుగాలకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడినట్టు తెలిపారు. శివవూర్వతి టెర్ర కోటా విగ్రహాలతో పాటు 15 యజ్ఞ కుండా లు.. భక్తికి, వేదాలకు సంబంధించి సంకేతంగా ఉన్నాయి. రాగి, ఇనుము మిశ్రమా లతో తయారు చేసిన నాణేలు, ఎముకలతో తయారు చేసిన సూదులు, అచ్చులు, పళ్లా లు మొదటిసారిగా తవ్వకాల్లో కనిపించాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

గతంలో 1961 నుంచి 1963 మధ్య ఇదే ప్రాంతంలో తవ్వకాలు చేపట్టిన భారత పురావస్తు శాఖ నాగరికతకు సంబంధించిన పలు ఆధారాలను సేకరించింది.రాజస్థాన్‌లో 4500 ఏళ్ల క్రితం నాటి నాగరికత ఆనవాళ్లు బయటపడడం సంచలనం కలిగించింది. రాజస్థా న్‌లోని డీగ్ జిల్లా భాజ్ గ్రామంలో భారత పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో ఇవి వెలుగు చూశాయి. మహాభారత, మౌర్య, శుంగా రాజవంశీయుల కాలం నాటి వస్తువులు, ఆయుధాలు బయటపడడం విశేషం. ఈ ఏడాది జనవరి 10న పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టింది.

అప్పటి నుంచి ఆరు నెలలుగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు 23 మీటర్ల లోతైన పురాతన నది పాయను గుర్తించారు. హరప్పా, బ్రజ్, మథుర ప్రాంతాల్లోని ఆనాటి నాగరికతల నివాసానికి ఈ నది కీలక ఆధారంగా ఉండేదని పేర్కొన్నారు. కాగా తవ్వకాల్లో 800లకు పైగా పురాతన వస్తువులు బయటపడ్డాయి. వీటిలో అత్యంత పురాతన నాణేలు, ముద్ర లు, యజ్ఞ కుండాలు, మౌర్య, కుషాణ, గుప్త కాలం నాటి విగ్రహాలు ఉన్నాయి. కాగా తవ్వకాల్లో బయటపడిన పనిముట్లు, ఆయుధా లు 2500 బీసీల కాలం నాటివని తెలుస్తోం ది.

దీనిని బట్టి ఇవి మహాభారత కాలం నాటివని తెలుస్తోంది. వీటితో పాటు ఒక మానవ పుర్రె కూడా లభ్యమైంది. పరిశోధన కోసం మానవ పుర్రెను ఇజ్రాయెల్‌కు పంపించారు. మొత్తానికి ఈ తవ్వకాల ద్వారా ఐదు చారిత్రక దశల ఆధారాలను శాస్త్రవేత్తలు గుర్తించడం విశేషం. మహాభారత యుగంతో పాటు హరప్పా, మౌర్యుల, కుషాణ, గుప్త యుగాలకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడినట్టు తెలిపారు.

శివవూర్వతి టెర్ర కోటా విగ్రహాలతో పాటు 15 యజ్ఞ కుండా లు.. భక్తికి, వేదాలకు సంబంధించి సంకేతంగా ఉన్నాయి. రాగి, ఇనుము మిశ్రమా లతో తయారు చేసిన నాణేలు, ఎముకలతో తయారు చేసిన సూదులు, అచ్చులు, పళ్లా లు మొదటిసారిగా తవ్వకాల్లో కనిపించాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గతంలో 1961 నుంచి 1963 మధ్య ఇదే ప్రాంతంలో తవ్వకాలు చేపట్టిన భారత పురావస్తు శాఖ నాగరికతకు సంబంధించిన పలు ఆధారాలను సేకరించింది.