25-06-2025 10:10:57 PM
ఘర్షణలో ఒకరు మృతి..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం(Bhadrachalam) పట్టణంలోని శిల్పినగర్ ప్రాంతంలో కోదండ రామాలయం పక్కన గురువారం ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి మృతికి దారి చేసింది. ఇద్దరు యువకులు రోడ్డుపై ఘర్షణ పడగా అందులో ఒక యువకుడు రోడ్డు మీద పడి తలకి బలమైన గాయాలు తగిలి ప్రమాదవశాత్తు చనిపోయినట్లు కొందరు పేర్కొంటుండగా, అక్కడ ఆగిన వాహనం కింద పడిపోవడం వల్లే చనిపోయినట్లు మరికొందరు పేర్కొంటున్నారు. చనిపోయిన యువకుడు భద్రాచలం పట్టణంలోని ముదిరాజ్ బజార్ కి చెందిన మనోజ్ గా పేర్కొంటున్నారు. పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ కు అత్యంత సమీపంలోనే ఈ సంఘటన జరగటం గమనార్హం. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.