25-06-2025 09:47:21 PM
ఖమ్మం (విజయక్రాంతి): చింతకాని మండల పర్యటనలో భాగంగా బుధవారం కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి(Collector Anudeep Durishetty) వందనం గ్రామంలోని స్వయంభు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంను దర్శించుకున్నారు. ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆశ్వీరాదం ఇచ్చి స్వామివారి శేషవస్త్రం, తీర్ధాప్రసాదాలు కలెక్టర్ కు అందించారు.
వందనం గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కలెక్టర్ అనుదీప్ వందనం గ్రామంలోని నర్సరీని సందర్శించి, నర్సరీ అంతా కలియతిరిగి మొక్కలను పరిశీలించారు. జిల్లాలో వన మహోత్సవంలో భాగంగా నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు ప్రతి గ్రామంలో వన నర్సరీల ద్వారా మొక్కలు పెంచి అదే గ్రామంలో నాటించడానికి ఏర్పాట్లు చేయాలని, మొక్కల సంరక్షణకు చేయాల్సిన కార్యచరణ సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, చింతకాని ఎంపీడివో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.