calender_icon.png 26 June, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంపాపేటలో అమావాస్య అన్నదానం

25-06-2025 10:14:10 PM

అన్నదానాన్ని ప్రారంభించిన కర్మన్ ఘాట్ ఆలయ డైరెక్టర్ పూల నాగరాజు...

ఎల్బీనగర్: మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ చైర్మన్ దండేటికర్ భగవత్ జీ ఆధ్వర్యంలో చంపాపేట్ నల్ల పోచమ్మ, ఎర్ర పోచమ్మ దేవాలయాల ఆవరణలో బుధవారం అమావాస్య అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ దేవాలయ డైరెక్టర్ పూల నాగరాజు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. భగవత్ జి ఆధ్వర్యంలో 26 నెలలుగా విజయవంతంగా అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షనీయమని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకొచ్చి సహకరించడం కూడా అభినందనీయమని, అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్టు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమమే నిర్వహించకుండా, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం కూడా హర్షనీయమన్నారు.

కార్యక్రమంలో మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ప్రతినిధులు రవి ముదిరాజ్, తింగ్లీకర్ రాజేశ్, సామ మహేశ్వర్ రెడ్డి, తిలక్ రాజ్, ఆడేళ్ల రాజ, ఘనసాల చింటూ, వెంకటేష్, బి సుశీల్ కుమార్, సంతోష్ లడ్డ, అండే కార్ వెంకటేష్, జమాల్పూర్ శివ, పీఠం ప్రదీప్, సిల్వేరు అనిల్, అవినాష్ రెడ్డి, శానవాజ్ హుస్సేన్, సాయికుమార్, ఘనసాల మురళి, భానుక రమేష్, బోయినాల అనిల్ కుమార్, కాంటేకారు విఠల్, జమాల్పూర్ హరిలాల్, కర్నాటి మనోహర్, సంపత్, సాయికుమార్, ఆనగల జగదీష్, శ్రీను నాయక్, సంతోష్ రెడ్డి, శ్రీరామ్, రాదే కుమార్, గుర్రం పావని, చందు, వేణుగోపాల్ రెడ్డి,  సంతోష్ కుమార్, సంజు కుమార్, తిప్పిరెడ్డి స్వాతి తదితరులు పాల్గొన్నారు.