20 March, 2026 | 6:15 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

కాన్వాయ్ డ్రైవర్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం

05-02-2025 03:58 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu) కాన్వాయ్‌లోని డ్రైవర్ ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మృతి చెందారు. అమీన్‌బాబు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమీన్ బాబు చాలా కాలంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.

అర్థరాత్రి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ అమీన్‌బాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ప్రభుత్వం వారికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని హామీ ఇచ్చారు.