04-06-2025 06:43:51 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): శాసనమండలి మాజీ సభ్యుడు, సీనియర్ నాయకుడు మాగం రంగారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మాగం రంగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. రంగారెడ్డి ఆకస్మిక మరణం బాధాకరమని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాగం రంగారెడ్డికి బుధవారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రంగారెడ్డి అంత్యక్రియలను గురువారం శామీర్ పేటలో నిర్వహించనున్నారు. మాజీ సీఎం నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి హయంలో కాంగ్రెస్ తరపున ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.