04-06-2025 07:49:56 PM
నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట కళా నిలయంలో 40 వ జాతీయ స్థాయి నవరస శాస్త్రీయ సంగీత నాట్య కళారూపాల పోటీలు జరిగాయి. కూచిపూడి నృత్య విభాగంలో ఈ పోటీలో 10 సం. వయసు లోపు చిన్నారులు పాల్గొన్నారు. ఈ నృత్య పోటీలో ఇందూరి జిల్లా వాసి అయిన తేలి విభ శ్రీ "తరంగం" నృత్య ప్రదర్శన చేసి "ప్రత్యేక జ్యూరీ నాట్య మయూరి అవార్డ్ " సొంతం చేసుకుంది. ఈ చిన్నారి నగరంలోని శ్రీ కరణం శ్రీనివాస్ గారి నాట్య తరంగిణి కళాశాలలో ప్రత్యేక నృత్యం అభ్యసించింది.
తరంగం - ప్లేటుపై నిలబడి తలపై చెంబుతో "కృష్ణం కలయ సఖి" నృత్యాన్ని చేస్తూ ప్రేక్షకులను అబ్బురపరుస్తూ చిలకలూరిపేట కళా నిలయంలో ప్రశంసలు పొందింది. చిన్నారి విభా శ్రీ ఇటు శాస్త్రీయ నృత్యాన్ని, పాశ్చాత్య నృత్యాన్ని రెండు కళల్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులైన విజయ్ కుమార్-ప్రసన్నలకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రత్యేక అభినందనలు తెలిపారు.