12 July, 2026 | 2:14 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

లా అండ్ ఆర్డర్ పట్ల సీఎం సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు

13-09-2024 10:01 AM

హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ జితేందర్‌ను ఆదేశించారు. రాజకీయ కుట్రలను సహించేది లేదని, హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీఆర్‌ఎస్ పని చేస్తోందని ఆరోపించారు. సిఎం ఆదేశాల మేరకు డిజిపి డాక్టర్ జితేందర్ ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్‌లతో సమావేశం నిర్వహించారు.

మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడవద్దని డీజీపీ ఉద్ఘాటించారు. ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పరిస్థితిని చెడగొట్టే వ్యక్తులను సహించేది లేదని డీజీపీ తెలిపారు. ప్రజలందరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని డిజిపి కూడా విజ్ఞప్తి చేశారు. అటు మహిళా కాంగ్రెస్ నేతలు ఇవాళ స్వీకర్ ను కలవనున్నారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరనున్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో నాయకులు స్వీకర్ కువినతి పత్రం ఇవ్వనున్నారు.