26-07-2024 05:35:52 PM
హైదరాబాద్: ధరణి పోర్టల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, కోదండ రెడ్డి, కె. కేశవరావు పాల్గొన్నారు. ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులు ఇతర అంశాలపై చర్చించారు. ధరణి సమస్యల పరిష్కారానికి లోతుగా అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం దశగా చర్యలు చేపట్టాలని సీఎం పేర్కొన్నారు.
సవరణలపై కొత్త సమస్యల రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మార్పులు, చేర్పులపై ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం తేవాలని ముఖ్యమంత్రి తెలిపారు. ధరణిపై అవసరమైతే అసెంబ్లీలో చర్చ పెడదామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.