calender_icon.png 3 June, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం : సీఎం రేవంత్

01-06-2025 10:09:33 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్ల, రెవెన్యూ సదస్సులు, పంటల సాగు సన్నద్ధతపైన బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రేవంత్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హాజరయ్యారు.

ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించాలని, కీలక అంశాలను నిర్ణయించారు. పూర్తి పరిశీలన తర్వాతే రాజీవ్ యువ వికాసం అర్హులను ప్రకటించాలని, ఒక్క అనర్హుడికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరకూడదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే డిప్యూటీ సీఎంకు నివేదిక అందిందని, ఆ నివేదికను ముఖ్యమంత్రి, మంత్రులకు భట్టి వివరించారు. ధాన్యం కొనుగోళ్లు సమర్ధవంతంగా నిర్వహించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.