12-04-2025 12:38:55 AM
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పనులు వేగవం తం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవం త్రెడ్డి ఆదేశించారు. బాపూఘాట్టో నిర్మించతలపెట్టిన గాంధీ సరోవర్తో పాటు మీర్ ఆలం ట్యాంక్పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను సీఎం పరిశీలించారు. మీర్ ఆలం ట్యాంక్పై బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్లో టెండర్లు పిలవాలని సీఎం సూచించారు.
ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మూసీ పునరుజ్జీవంపై సీఎం రేవంత్రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మీర్ ఆలం ట్యాంక్పై నిర్మించే బ్రిడ్జికి సంబంధించి కన్సెల్టెన్సీలు తయారు చేసిన నమూనా డిజైన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు.
రెండున్నర కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించాలని, అదే సమయంలో సందర్శకులు, ప్రయాణికు ల రక్షణకు అత్యంత ప్రాధాన్యముండే డిజైన్లను ఎంపిక చేయాలని సూచించారు.
ఈ బ్రిడ్జితో పాటు మీర్ ఆలం ట్యాంక్లో వివిధ చోట్ల ఐలాండ్లు ఉన్న మూడు ప్రాంతాలను పర్యాటకులను ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలని, సింగపూర్లోని గార్డెన్స్ బై ది బేను తలపించేలా బర్డ్స్ పారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఈ మూడు ఐలాండ్లను తీర్చిదిద్దాలని సీఎం పేర్కొన్నారు. వెడ్డింగ్ డెస్టినేషన్కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వెంచర్ పార్క్, థీమ్ పార్క్, అంఫీ థియేటర్ను ఏర్పాటు చేసేందుకు వీలుగా డిజైన్లు ఉండాలన్నారు.
జూ పార్క్కు అనుసంధానం..
మీర్ ఆలం బ్రిడ్జితో పాటు ఈ ఐలాండ్ జోన్ను పక్కనే ఉన్న జూ పార్క్కు అనుసంధానం చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఇక్కడి డెవలప్మెంట్ ప్లాన్ను దృష్టిలో పెట్టుకొని జూపార్క్ను అప్గ్రేడ్ చేయాలన్నారు. జూ అధికారులతో సంప్రదింపులు జరిపి, నిబంధనల ప్రకారం అప్గ్రేడ్ చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
పర్యాట కులను మరింత ఆకట్టుకునేలా అభివృద్ధి ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పా రు. ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్రెడ్డి, శ్రీనివాసరాజు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, మూసీరివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గౌతమి ఇతర అధికారులు పాల్గొన్నారు.
పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్..
బోటింగ్తో పాటు పర్యాటకులు విడి ది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ట్యాంక్లో నీటిని శుద్ధి చేయటంతో పాటు ఐలాండ్ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం చెప్పారు. పీపీపీ విధానంలో ఈ ఐలాండ్ జోన్ను అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతేకాకుండా మీర్ ఆలం ట్యాంక్లో నీటి లభ్యతను, వరద వచ్చినప్పుడు ఉండే నీటి ప్రవాహ తీవ్రతను ముందుగానే అంచనా వేసుకొని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా డిజై న్లు తయారు చేయాలని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలజీతో పాటు పర్యావరణానికి సంబంధించి నిపుణులు, లేదా ఆ రంగంలో పేరొందిన సం స్థలతో సర్వే చేయించాలని సీఎం రేవంత్ సూచించారు.