calender_icon.png 17 September, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది

17-09-2025 10:40:09 AM

బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేదు

ఏ రాష్ట్రం చేయని విధింగా రైతులకు మేలుచేస్తున్నాం

హైదరాబాద్: పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం- 2025(Telangana Praja Palana Dinotsavam) వేడుకల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) పాల్గొన్నారు. గన్ పార్క్ లో అమరవీరులకు సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదన్నారు. ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం మనదని ఆయన గుర్తుచేశారు. సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంత పాలనను పక్కనపెట్టామని తెలిపారు. మా పాలనలో బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి తావులేదన్నారు. స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయంలో రూల్ మాడల్ గా ఉన్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఉన్నత చదువుల ద్వారా మన యువత సత్తా చాటాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పాఠశాలల రూపరేఖలు మారబోతున్నాయని సూచించారు. విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం వెల్లడించారు. త్వరలో రాష్ట్ర విద్యా విధానం తెస్తున్నామని తెలిపారు. సాయుధ పోరాటంలో మహిళలపాత్ర ఎనలేనిదని రేవంత్ రెడ్డి కొనియాడారు. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి సత్తా చాటారని పేర్కొన్నారు. డ్వాక్రా ఉత్పత్తుల విక్రయానికి మరిన్ని మహిళా మార్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతుల కోసం తెచ్చే పథకాలు సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులకు మేలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా రైతుల సంక్షేమం విషయంలో రాజీ పడలేదని తేల్చిచెప్పారు.

సాగు మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహించి వేంగా ఫలితాలు వెల్లడించామని పేర్కొన్నారు. సివిల్స్ పరీక్షలు రాసేవారికి ఆర్థిక సాయం అందిస్తున్నామని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం ధరణి వల్ల రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైందని ఆరోపించిన రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం వచ్చాక భూభారతి చట్టం తెచ్చి సమర్థంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పేదల ఆత్మగౌరవం పెంచేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్ర మనదని చెప్పారు. కృష్ణా, గోదావరి నదీజలాలపై రాజీ పడేది లేదన్నారు. కృష్ణానదీ జలాల్లో న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నామని చెప్పిన ముఖ్యమంత్రి 904 టీఎంసీల సాధనకు ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. కృష్ణానదీ జలాల హక్కుల కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని సూచించారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ పూర్తి చేసి ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా వెనకడుగు వేసేది లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.