17 April, 2026 | 2:13 PM

Breaking News

కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •  

క్యాన్సర్ బాధిత కుటుబానికి సీఎం అండ

15-05-2025 01:25 AM

చికిత్సకు రూ.12 లక్షల అందజేత 

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): క్యాన్సర్ బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అండగా నిలిచారు. బ్లడ్ క్యాన్సర్ బారినపడిన సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల సాయిచరణ్ చికిత్సకు రూ.12 లక్షలు అందజేశారు. సాయిచరణ్‌కు భార్య లక్ష్మిప్రసన్న, కుమార్తెలు లక్ష్మి సుసజ్ఞ, స్మయతో పాటు తల్లితండ్రులు రాము, సునీత ఉన్నారు.

ఇంటికి ఆధారమైన సాయిచరణ్ క్యాన్సర్ బారినపడటంతో అతడి చికిత్సకు కుటుంబ సభ్యులు సిద్దిపేట మండలం ఎన్సాన్‌పల్లిలో ఉన్న తమ ఇంటిని విక్రయించారు. అయినప్పటికీ చికిత్సకు డబ్బులు సరిపోకపోవటంతో.. వారు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తమ ఆర్థిక ఇబ్బందులను విన్నవించుకున్నారు.

చలించిన సీఎం రేవంత్‌రెడ్డి, సాయిచరణ్ చికిత్సకు రూ.5 లక్ష లు మంజూరు చేశారు. దాంతో హైదరాబాద్‌లోని బసవతారాకం క్యాన్సర్ ఆసుపత్రిలో సాయిచరణ్‌కు స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తయింది. చికిత్సకు అదనంగా వ్యయమైన మరో రూ.7 లక్షలకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా అందించాలని సీఎం ఆదేశించటంతో అధికారులు ఆ మొత్తాన్ని అందజేశారు.

చికిత్స చేయించుకున్న సాయిచరణ్ కుటుంబసభ్యులతో కలిసి బుధవారం సచివాలయానికి వచ్చి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ధైర్యంగా ఉండాలని సీఎం సాయిచరణ్‌కు సూచించారు.