27 June, 2026 | 7:43 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

నిబంధనలు పాటించకపోతే సీజ్ తప్పదు: ఆర్టీవో బాలునాయక్

15-05-2025 11:31 AM

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): బడి పిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తరలించేందుకు వినియోగించే ప్రైవేటు బస్సుల యజమానులు నిబంధనలను పాటించకపోతే ఫిట్నెస్ పొందని బస్సులను సీజ్ చేస్తామని ఆర్టీవో బాలు నాయక్ (RTO Balu Nayak)హెచ్చరించారు.  ఆర్టీవో కార్యాలయంలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 60 ప్రైవేటు స్కూల్ బస్సులు అన్ని ఫిట్నెస్ పొందాల్సిందేనని నిబంధనల ప్రకారం తూచా తప్పకుండా పాటించాలన్నారు. వారితోపాటు ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్, స్కూల్ బస్ యాజమాన్యం ఉన్నారు.