16-06-2025 01:30:29 AM
శేరిలింగంపల్లి, జూన్ 15:శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా 6 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 2,20,000/- రెండు లక్షల ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను తన నివాసంలో బాధిత కుటుంబాలకు అందజేశారు పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేద, అభా గ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని తెలియచేశారు. అనంతరం వైద్య చికిత్సకు సహకారం అందించిన ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్,సమ్మారెడ్డి, నరేష్ ముది రాజు,కుమార్ తదితరులుపాల్గొన్నారు.