calender_icon.png 16 June, 2025 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సాహంగా 5కె రన్

16-06-2025 01:32:34 AM

ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ప్రిన్సిపల్ సెక్రెటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిడిఎంఏ శ్రీదేవి

 రాజేంద్రనగర్, జూన్ 15: వంద రోజుల ప్రణాళికలో భాగంగా నార్సింగి మున్సిపాలిటీలో ఆదివారం ఉదయం 5 కె రన్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నా రు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సీడి ఎం ఏ శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండిపేట లో ఉన్న మెహులా పాఠశాల ఆవరణలో మొ క్కలు నాటి జెండా ఊపి 5 కె రన్ ప్రారంభించారు.

మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల ప్రదర్శన స్టాల్స్ను అతిథులు సందర్శించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలను అభినందించారు. స్వయం శక్తితో ఎదగడం గొప్ప విషయమని కొని యాడారు. ఈ సందర్భంగా వారు మహిళా సంఘాల సభ్యుల స్టాల్స్ నుంచి కొనుగోలు చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

అనంతరం రన్ లో పాల్గొన్న వారికి అతిథులు సర్టిఫికెట్లు అందజేశారు. ప్రజలు ఆరోగ్యం పైన కూడా శుద్ధ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో స్వచ్ఛంద సంస్థ లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులుపాల్గొన్నారు.