04-12-2025 12:00:00 AM
పీఎసీ చైర్మన్ గాంధీ
శేరిలింగంపల్లి, డిసెంబర్ 3 (విజయక్రాంతి) : మియాపూర్ డివిజన్ పరిధిలోని నాగార్జున ఎనక్లేవ్ కాలనీ కి చెందిన భాగ్యమ్మ దమనికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా సీఎంఆర్ఎఫ్ సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 2,50,000/- రెండు లక్షల యాబై వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ బుధవారం తన నివాసంలో బాధితీరాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయినేనీ చంద్రకాంత్ రావు, చంద్ర మోహన్ సాగర్, ఆనంద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.