calender_icon.png 25 June, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఆపద సమయంలో సీఎంఆర్‌ఎఫ్ ఆసరా’

25-06-2025 01:35:38 AM

మేడ్చల్, జూన్ 24(విజయ క్రాంతి): పేద ప్రజలకు ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా ఉంటుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని పలువురికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు కొన్ని సందర్భాలలో తప్పనిసరి పరిస్థితుల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందని, చికిత్స అనంతరం అప్పు చేసి బిల్లు చెల్లిస్తున్నారన్నారు. ఇలాంటి వారికి సీఎంఆర్ ఎఫ్ కొంత ఉపశమనం కలిగిస్తోందన్నారు. మౌలాలి డివిజన్ కి చెందిన చంద్రకళకు రూ.21 వేలు, సునీతకు రూ.21 వేలు, వినాయక నగర్ డివిజన్ కి చెందిన ఇందిరకు రూ.60 వేల చెక్కులను అందజేశారు.

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైనందున లబ్ధిదారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, జేఏసీ వెంకన్న, అమీనుద్దీన్, భాగ్యానంద్ రావు, ఉస్మాన్, మారుతి ప్రసాద్, వంశీ పాల్గొన్నారు. 

ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపిన బస్తీ వాసులు 

గౌతమ్ నగర్ డివిజన్లోని జయగిరి లక్ష్మీ నరసింహ నగర్, న్యూ వెంకటేశ్వర నగర్, హిల్ టాప్ బస్తీ వాసులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బస్తివాస్తుల ఇళ్లకు తాళాలు వేసి, నోటీసులు అందజేయగా ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి తన సొంత ఖర్చులతో లాయర్లను సంప్రదించి స్టే ఆర్డర్ తెప్పించారు. దీంతో కాలనీవాసులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, వెంకన్న, బైరు అనిల్, సిద్ధి రాములు, కృష్ణ గౌడ్, కాటంరాజు తదితరులు పాల్గొన్నారు.