calender_icon.png 18 October, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలో నాగుపాము

15-10-2025 12:00:00 AM

కొత్తగూడెం, అక్టోబర్ 14 (విజయక్రాంతి) ః భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాలలో,మంగళవారం  మధ్యాహ్న భోజన సరుకులు నిలువ ఉంచే గదిలో వంట కోసం నిలువ ఉంచిన కర్రల్లో  ఐదు అడుగుల నాగుపాము(నాజా నాజా) బుసలు కొడుతూ పైకి లేవడంతో ఒక్కసారిగా భయపడి పోయిన సిబ్బంది, ప్రధాన ఉపాధ్యాయులకు విషయం చెప్పగా వారు వెంటనే ప్రాణధార ట్రస్ట్ అధ్యక్షుడు, మున్సిపల్ కార్పొరేషన్ స్నేక్ స్పెషలిస్ట్ సంతోష్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకొని వెతికి పట్టుకొని సురక్షితంగా బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం చుంచుపల్లి పాఠశాల, కళాశాల కు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయుల సందేహాలకు పాముల పై అవగాహన కల్పించారు. మన జిల్లా ఏజెన్సీ గడ్డ పాములకు అడ్డా అని ఏమనపాటుగా ఉండకూడదని అవగాహన, పరిశుభ్రత అవసరమని అన్నారు. ఈ రోజు రామవరం, జిఆర్ బస్తి, సుజాతనగర్, శ్రీనగర్ కాలనీ ల్లో కూడా పట్టిన విషయాన్ని వివరించారు.  కళాశాల ఆవరణలో పాముల వల్ల సమస్య తలెత్తిన ప్రతిసారి క్షణాల్లో స్పందించి సమస్య పరిష్కరిస్తున్న సంతోష్ , కార్పొరేషన్ కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు.