13 April, 2026 | 7:41 PM

సమస్య విన్నారు.. పరిష్కరిస్తామన్నారు

13-04-2026 06:32 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత భవనంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణిలో రెవిన్యూ పరమైన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వాటిపై దృష్టి పెట్టాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ ఆర్డిఓ రత్న కళ్యాణి జిల్లా అధికారులు ఉన్నారు కలెక్టర్ 12 గంటలకు రావడంతో అప్పటివరకు అర్జీదారులు ఆమె కోసం వేచి చూసి ఒక్కసారిగా దరఖాస్తు సమర్పించుకున్నారు.