24 April, 2026 | 9:16 PM

వరి ధాన్యం కేంద్రం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

24-04-2026 08:26 PM

- రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశం

కోహెడ: మండలంలోని శనిగరం ఐకెపి  కేంద్రాన్ని కలెక్టర్  హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా వరి ధాన్యo కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇక్కడ లోడ్ చేసిన వరి ధాన్యంను బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామం లోని శ్రీ లక్ష్మీ రైస్ మిల్ కు పంపిస్తున్నట్లు ఐకేపి సిబ్బంది కలెక్టర్ కు  చెప్పారు. ధాన్యం గ్రేడ్ విషయంలో సమస్యలు ఉన్నందున పరిష్కరించాలని రైతులు కోరగా అగ్రికల్చర్ అధికారులు వచ్చి ధాన్యం అంత పరిశీలన చేసి గ్రేడ్ కేటాయించేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు.

సెంటర్ లో తాగునీటి వసతి, కంఠాల, తాలు తీసే యంత్రాలు, గన్ని బ్యాగులు, సుతిల్ దారాలు ప్రతిదీ ఉండేలా చూసుకోవాలని, ధాన్యం తేమ శాతం వచ్చాక తాలు తీసాకే లోడ్ చేయించాలని సిబ్బందికి తెలిపారు. అలాగే రైతులు రాత్రి వేళలో ధాన్యం పైన టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచాలని అకాల వర్షాలు పడే ఆస్కారం ఉందని సూచించారు.