09-06-2025 01:03:01 AM
రామాయంపేట, జూన్ 8 : రామాయణపేట మండలం అక్కన్నపేట చౌక ధరల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆదివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రేషన్ కార్డుదారులకు ఒకేసారి మూడు నెలల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అక్కన్నపేట చౌక ధరల రైస్ దుకాణాన్ని కలెక్టర్ పరిశీలించారు.
బియ్యం నాణ్యతను ఈపాస్ డివైస్ లో కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్ పని విధానాన్ని అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రజాపంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారుల తదితరులు పాల్గొన్నారు.