09-06-2025 01:04:38 AM
మునిపల్లి, జూన్ 8 : ఆస్ట్రేలియా సిడ్నీలో వెస్టర్న యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన పైతర సాయికళ్యాణ్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ సర్టిఫికెట్ ను యూనివర్సిటీ ఛాన్స్లర్ చేతుల మీదుగా అందుకున్నాడు.
ఈ సందర్భంగా సాయికళ్యాణ్ తల్లిదండ్రులు మాజీ జెడ్పిటిసి సభ్యురాలు పైతర మీనాక్షి సాయికుమార్ ఆస్ట్రేలియాకు వెళ్లి అభినందించారు. సాయి కళ్యాణ్ తండ్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, పీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్గా ఉండగా, తల్లి మునిపల్లి మాజీ జెడ్పిటిసిగా పనిచేశారు. వీరితో పాటు మనోజ్తదితరులుఉన్నారు.