30 August, 2026 | 12:20 AM

Breaking News

ఫారంపాండ్ల పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •   దశదిన కార్యక్రమంలో నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్   •   స్నేహితుడి కుటుంబానికి 1996 బ్యాచ్ ఆపన్నహస్తం   •   కనుగుట్ట గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా: ఎంపీ జి.నగేష్   •   గోపాల్‌పేట్‌లో పచ్చదనం పరిమళించాలి   •   నాచారం పోలీస్ స్టేషన్ సందర్శించిన చైతన్య స్కూల్ విద్యార్థులు   •   కాంగ్రెస్ పార్టీలో తారాస్థాయికి వెళ్లిన వర్గవిబేధాలు   •   దోమకొండ సింగల్ విండో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం   •   రాత్రిపూటా ఆర్టీసీ రయ్ రయ్   •   అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు   •  

మీతో పాటు నేను..!

31-07-2025 05:40 PM

నేలపై కూర్చొని విద్యార్థులతో భోజనం చేసిన కలెక్టర్ 

జయశంకర్ భూపాలపల్లి,(విజయక్రాంతి): మీలాగే నేను కూడా మీతో పాటు కలిసి భోజనం చేస్తానంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి మండలం ఆజంనగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం తిన్నారు. గురువారం ఆజం నగర్ ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మమేకమయ్యారు.

విద్యాబోధన, విద్యా ప్రగతిపై విద్యార్థులతో కలిసిమెలిసి అడిగి తెలుసుకున్నారు. వివిధ సబ్జెక్టుల్లో వారికి ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. అనంతరం మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థులతో సహా నేలపై కూర్చొని భోజనానికి ముందు ప్రార్ధన చేసి సహపంక్తి భోజనం చేశారు. పిల్లలతో కలిసి భోజనం చేయడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు మెరుగని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.