27-06-2025 10:17:18 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లి మండలంలో కేజీబీవీ బాలికల పాఠశాలలో కొత్తగా బైపీసీ సబ్జెక్టు కాలేజీ కొరకు అప్గ్రేడ్ కావడం జరిగిందనీ కన్నెపల్లి కేజీబీవీ ఎస్ ఓ ఎం పద్మ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె విడుదల ఓ ప్రకటన విడుదల చేశారు. టెన్త్ క్లాస్ చదివిన విద్యార్థులు బైపీసీ లో జాయిన్ కావాలనీ కోరారు. ఇందులో 40 సీట్ల కొరకు అడ్మిషన్ చేయబడుననీ తెలిపారు. విద్యార్థులకు ఎంసెట్, నీట్ కోచింగ్ ఇవ్వబడుననీ వెల్లడించారు. అంతేకాకుండా విద్యార్థులకు ఉచిత భోజన వసతి, హాస్టల్స్ సౌకర్యం తో పాటు గా ఉచితoగా బుక్స్ కూడా ఇస్తామన్నారు. టెన్త్ క్లాస్ చదివిన పిల్లలు ఎవరైనా ఉంటే జాయిన్ కావాలని ఆమె కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.