17-06-2025 01:23:56 AM
నిజామాబాద్, జూన్ 16 : (విజయ క్రాం తి) : నిజామాబాద్ జిల్లా పాలనాధికారిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ టి. వినయ్కృష్ణారెడ్డి సోమవారం జిల్లా న్యాయమూర్తి జీ.వీ.ఎన్.భరతలక్ష్మిని మర్యాదపూ ర్వకంగా కలిశారు. జిల్లా న్యాయ స్థానాల సముదాయ భవనంలోని జిల్లా జడ్జి ఛాంబర్లో ఆమెకు పూల మొక్కను అందించారు. జిల్లా స్థితిగతులపై, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలపై ఇరువురు కొద్దిసేపు చర్చించారు.