20-05-2025 10:48:36 PM
పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన పాఠశాల బాధ్యులు..
సానుకూలంగా స్పందించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్..
బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రంలో గల తెలంగాణ గురుకుల పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్(District Collector Jitesh V. Patil) పరిశీలించారు. ప్రధానంగా మంచినీటితో పాటు పలు సమస్యలను గుర్తించి వాటి పరిష్కార దిశగా సంబంధిత శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. గురుకుల చుట్టు ప్రక్కల మునగ మొక్కలతో పాటు పలు మొక్కలు నాటాలని ఆదేశించారు.
ఇంకుడు గుంతలను పరిశీలించి పలు ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. సోలార్ లైటింగ్ ఏర్పాటు చేసి, ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టి విద్యార్థులకు భద్రత్ర పెంచాలని సూచించారు. పలు నిర్మాణాల కట్టాడాలు చేయాలని, పాఠశాలల ప్రారంభ సమయానికి పనులు పూర్తి కావాలని ఐటీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.