16 April, 2026 | 9:03 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

మధ్యాహ్న భోజనంపై కలెక్టర్ ఆగ్రహం

27-02-2026 12:59 AM

సిద్దిపేట రూరల్, ఫిబ్రవరి 26: సిద్దిపేట రూరల్ మండలంలోని ఇర్కోడ్ గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల, సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బిర్యానీ అన్నం, కూరలు, సాంబారు నాణ్యత సరిగా లేకపోవడంపై వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ పాటించకపోవడమే కాకుండా వంటలు రుచిగా, నాణ్యతగా వడ్డించడం లేదని హెచ్చరించారు.

భోజన ప్రక్రియను ఫుడ్ చెకింగ్ టీచర్ పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం బాలికల వసతి గృహాన్ని సందర్శించి భోజన నాణ్యతను పరిశీలించారు. పాలకూర పప్పు పలచగా ఉందని మెరుగుపరచాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి కడుపునిండా భోజనం చేయాలని సూచించారు. డ్రైనేజీ సమస్యపై ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి పరిష్కారం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల పనితీరులో మార్పు లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.