27 February, 2026 | 1:09 PM

ఆధ్యాత్మిక కేంద్రంగా గూడూరు శ్రీ గురుపీఠం

27-02-2026 12:57 AM

ట్రస్ట్ చైర్మన్ జిన్నారం శివకుమార్ గౌడ్

శివంపేట, ఫిబ్రవరి 26: శివంపేట మండల కేంద్రంలోని గూడూరు గ్రామంలో గురువుల కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలని సంకల్పంతో గురు పీఠం నిర్మించడం జరిగిందని గురు పీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ అన్నారు.

అనతి కాలంలోనే నిర్మితమైన గూడూరు గురు పీఠంలో శుద్ధ నవమి గురువారం సందర్భంగా శ్రీ గురు పీఠంలోని దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం మరియు శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలో విశేష పూజ కత్తువులు ఘనంగా వేద పండితుల మధ్య ప్రత్యేక పూజలు జరిగాయి. అంతరం గురు పీఠం చా రిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్, రమాదేవి పుణ్య దంపతుల సహకారంతో వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. గురు పీఠం ట్రస్ట్ సభ్యులు రాజ్యం బిక్షపతి యా దవ్, స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్ గౌడ్, జిన్నారం పెద్దగోని సూర్యం గౌడ్, లిఖిత, సురేందర్ గౌడ్, రాజేందర్ రెడ్డి, చిన్న, మరియు దత్తాత్రేయ భక్తులు సాయిబాబా భక్తులు పాల్గొన్నారు.