27-10-2025 09:02:17 AM
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో(Delhi) దారుణం చోటుచేసుకుంది. అశోక్ విహార్ ప్రాంతంలో 20 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీకి వెళ్తున్న యువతిని అడ్డగించిన ముగ్గురు స్నేహితులు యువతిపై యాసిడ్ పోశారు. యువతిపై యాసిడ్(Acid Attack) విసిరిన అనంతరం నిందితులు జితేంద్ర, ఇసాన్, అర్మాన్ అక్కడి నుంచి పారిపోయారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని(Delhi University) నాన్-కాలేజియేట్ ప్రోగ్రామ్కు చెందిన విద్యార్థిని లక్ష్మీబాయి కళాశాల సమీపంలో అదనపు తరగతికి వెళుతుండగా జరిగిన దాడి నుండి ముఖాన్ని రక్షించుకుంది. కానీ ఆమె చేతులకు కాలిన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు యువతిని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ప్రధాన నిందితుడు జితేందర్(Jitender) నెలల తరబడి ఆమెను వేధిస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ సంఘటన స్థానికంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. యాసిడ్ ఘటనను ఎస్ఎఫ్ఐ, డీయూఎస్ యూ విద్యార్థి సంఘాలు ఖండించాయి. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, పారిపోయిన ముగ్గురు నిందితులను అరెస్టు చేయడానికి గాలింపు చర్యలు ప్రారంభించారు.
బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.... "నాకు న్యాయం కావాలి. వారిని వీలైనంత త్వరగా అరెస్టు చేయాలి" అని చెప్పింది. ఢిల్లీ పోలీసులు(Delhi Police) మాట్లాడుతూ.."ఆమె కళాశాల వైపు నడుచుకుంటూ వెళుతుండగా, ముకుంద్పూర్ నివాసి అయిన ఆమెకు తెలిసిన జితేందర్, అతని సహచరులు ఇషాన్, అర్మాన్లు మోటార్సైకిల్పై వచ్చారు. ఇషాన్ అర్మాన్కు ఒక బాటిల్ను అందజేశాడని, అతను ఆమెపై యాసిడ్ పోశాడని ఆరోపించారు. నిందితులు అక్కడి నుండి పారిపోయారు. జితేందర్ తనను వేధించేవాడని, దాదాపు నెల రోజుల క్రితం వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని బాధితురాలు వెల్లడించింది. క్రైమ్ టీమ్, ఎఫ్ఎస్ఎల్ టీమ్ నేరం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించాయి. బాధితురాలి వాంగ్మూలం, గాయాల స్వభావం ఆధారంగా, బీఎన్ఎస్ సంబంధిత విభాగాల కింద కేసు నమోదు చేయబడింది. దర్యాప్తు జరుగుతోంది." అని పోలీసులు పేర్కొన్నారు.