calender_icon.png 8 June, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేయాలి

08-06-2025 05:10:27 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ..

కామారెడ్డి (విజయక్రాంతి): ఆలయ అభివృద్ధికి నూతనంగా ఎంపికైన ఆలయ కమిటీ సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్(Government Advisor Mohammed Ali Shabbir) అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయ కమిటీ ప్రతినిధుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దోమకొండ మండల కేంద్రంలో చాముండేశ్వరి దేవి స్వామి దేవాలయ కమిటీ నూతన అధ్యక్షులు పాలకవర్గ సభ్యులతో షబ్బీర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. 

చాముండేశ్వరి దేవి స్వామి ఆలయ కమిటీ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా పెద్దారెడ్డి సిద్ధారెడ్డి, నార్ల వెంకటేశం, నర్ర గుల్ల ఎల్లయ్య, నిమ్మ రాజేశ్వరి, పూల బోయిన రమేష్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ... చాముండేశ్వరి దేవి అమ్మవారు ఆలయం చాలా మహిమలు గలదని అన్నారు. నాకు ఆలయ అభివృద్ధి చేసే అవకాశం కల్పించిందన్నారు. ఆలయ కమిటీ సభ్యులు నిజాయితీగా అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ అవకాశం దొరకడం చాలా గొప్ప విషయమని అన్నారు. అమ్మవారి కరుణతోనే మీకు ఈ పదవులు వచ్చాయని తెలిపారు.

ఆలయాన్ని అభివృద్ధి చేసి తమ పదవిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కోరినకోరికలు కోరుకున్న వారికి కొంగు బంగారం అవుతుందన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు శాయశక్తుల కృషి చేస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టిపిసిసి కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్, ఐరేని నర్సయ్య, నర్సారెడ్డి, అనంతరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పెద్దారెడ్డి సిద్ధారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, అబ్రబోయిన స్వామి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.