calender_icon.png 17 October, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్యాదులను విచారించిన అధికారి

16-10-2025 11:35:28 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాలలోని ప్రాథమిక కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘంలోని సభ్యులు చేసిన ఫిర్యాదులపై గురువారం విచారణ అధికారిగా వచ్చిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ కో ఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ దేవేందర్ ఫిర్యాదుదారుల, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను కాలేజీ రోడ్ లోని తెల్లకల్లు డిపోలో విచారించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరు వర్గాల ఫిర్యాదులను పరిశీలించి, వారి నుంచి సమాచారం సేకరించామని, ఈ వివరాలను పక్షం రోజుల్లోపు ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. సంఘం నియమ నిబంధనల మేరకే విచారణ జరుగుతుందని, బైలా ప్రకారం విచారించి నివేదిక అందజేయడం జరుగుతుందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపామన్నారు. అనంతరం ఫిర్యాదుదారులు సైతం వారికి జరిగిన అన్యాయంపై మీడియా దృష్టికి తీసుకువచ్చారు.