19-06-2025 12:00:00 AM
నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి
నిర్మల్, జూన్ 18(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన 11 ఏళ్లలో దేశం సమగ్ర అభివృద్ధికి ప్రజల వికాసానికి దోహదపడిందని నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మోదీ 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న మొక్కలు నాటారు.
దేశ రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వికసిత్ భారత లక్షంగా ప్రజల అభివృద్ధి కోరు తూ కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అ మలు చేస్తుందని తెలిపారు. 11 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఇదే స్ఫూర్తి ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రావుల రామనాథ్ మెడిసిమ్మ రాజు, పార్టీ నేతలు పాల్గొన్నారు