30-07-2025 08:44:26 PM
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) కన్నెపల్లి మండలం కేంద్రంలో విద్యుత్ అంతరాయంపై అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా గ్రామస్తులు ఆందోళన దిగారు. బుధవారం కన్నెపల్లి సబ్స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి విద్యుత్ అధికారులు తీరుపై నిరసన తెలిపారు. విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యుత్ అధికారుల తీరుతో అష్టకష్టాలు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోయినప్పుడు అధికారులు కనీస స్పందన లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై విసిగిపోయి సబ్ స్టేషన్ ముందు ధర్నా చేయక తప్పడం లేదని గ్రామస్తులు తెలిపారు.