21 March, 2026 | 1:17 PM

Breaking News

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్   •   నవోదయకు ఎంపికైన పోకల తనుష్   •   3 ట్రిలియన్ ఎకానమీ దిశగా ప్రణాళికలు!   •  

ముగిసిన జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలు

30-10-2024 05:03 PM

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

మెదక్ డీఈఓ డా. రాధా కిషన్

పాపన్నపేట: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు పాపన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం ఘనంగా ముగించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ క్రీడల్లో జిల్లాలోని అన్ని మండలాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి బాలురు అండర్ 14 విభాగంలో హవేలీ ఘనపూర్ జట్టు ప్రథమ స్థానంలో, నర్సాపూర్ జట్టు ద్వితీయ స్థానంలో, అండర్ 17 విభాగంలో మెదక్ జట్టు ప్రథమ స్థానంలో,  అల్లాదుర్గం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. బాలికలు అండర్ 14 విభాగంలో చేగుంట జట్టు ప్రథమ స్థానంలో, కొల్చారం జట్టు ద్వితీయ స్థానంలో నిలువగా, అండర్ 17 విభాగంలో కౌడిపల్లి ప్రథమ స్థానంలో కొల్చారం ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ రాధాకృష్ణ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో రాణిస్తూ రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచాలి అన్నారు. చదువుతోపాటు ఆటలు కూడా ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక హెచ్ఎం మహేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.