23 March, 2026 | 5:02 PM

Breaking News

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి   •   కార్లు, ఇళ్లు చూపించి ఆకర్షిస్తున్నారు.. క్యూనెట్ కేసులో కీలక వ్యక్తులు అరెస్ట్   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి   •   ఆనందోత్సాహాలతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం   •   అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి ఆర్థిక సహాయం   •   విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు రూ. కోటి ప్రమాదబీమా చెక్కులు పంపిణీ   •   విజయ రమణారావుకు సన్మానం   •   సిలిండర్స్ అక్రమంగా వినియోగిస్తున్నవారిపై సివిల్ సప్లయ్ ఇన్ఫోర్స్మెంట్ టీం దాడులు   •   పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత   •   యూసుఫ్‌గూడలో వ్యభిచార ముఠా అరెస్ట్   •  

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి పట్ల ఖండన

23-04-2025 08:35 PM

జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్ లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ పేర్కొన్నారు. విశ్రాంతి కోసం కాశ్మీర్‌కి వెళ్లిన నిర్దోష పర్యాటకులపై ఈ దాడి మానవతా విలువలపై జరిగిన దాడిగా భావిస్తున్నామని, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి జేబీపీ తరపున ఘన నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

దేశ భద్రతపై ఉగ్రవాదులు గుప్పిస్తున్న దాడులను తీవ్రంగా ఎదుర్కొనాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే గట్టి చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదాన్ని పెంపొందించే శక్తులపై నిష్ఠూరంగా ఎదురుదాడి చేయాలని డిమాండ్ చేశారు. జేబీపీ, మానవ హక్కులు,సామాజిక సమానత్వం, శాంతి పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్న పార్టీ అని ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యతను ప్రభుత్వ యంత్రాంగం మరింత ధీర్ఘంగా నిర్వర్తించాలని బుధవారం విడుదల చేసిన చేసిన ప్రకటనలో కోరారు.