26 June, 2026 | 6:28 PM

Breaking News

డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •   బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి పునః ప్రతిష్ట   •  

బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి పునః ప్రతిష్ట

26-06-2026 05:21 PM

గ్రామదేవతల ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి...

సమిష్టి కృషితో గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..

 సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా....

కొత్తగూడెం,(లక్ష్మీదేవిపల్లి),(విజయక్రాంతి): మన ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను, ఆచారాలను ప్రతిఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని,సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం, అనిశెట్టిపల్లి గ్రామంలో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించిన బొడ్రాయి, ముత్యాలమ్మతల్లి పునప్రతిష్ఠ మహోత్సవానికి, ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇటువంటి శుభకార్యాలు భక్తిభావంతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తాయని, భవిష్యత్ తరాలకు మన మూలాలను అందిస్తాయని, గ్రామదేవతల ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

గ్రామ ప్రజలంతా సమిష్టి కృషితో, కలిసికట్టుగా ఉంటూ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇంతటి మహత్తరమైన పునప్రతిష్ఠ కార్యక్రమాన్ని గ్రామస్థులు ఐక్యతతో విజయవంతం చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు. అనంతరం ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన  అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అన్నదానం వంటి సత్కార్యాలు సమాజంలో సేవాభావాన్ని, మానవత్వాన్ని చాటుతూ ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా  పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు వెంకట నర్సయ్య, రమణయ్య, వీరబాబు, నాగేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, సతీష్, శ్రీనివాసరావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.